Chitradurga: అగ్నికి ఆహుతైన ప్రైవేటు బస్సు.. ఐదుగురి సజీవ దహనం

  • విజయపుర నుంచి బెంగళూరు వెళ్తున్న బస్సు
  • ప్రమాద సమయంలో బస్సులో 32 మంది ప్రయాణికులు
  • మృతుల్లో ఇద్దరు చిన్నారులు, మహిళ
5 charred to death after private bus catches fire in Chitradurga

కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లాలో ఈ తెల్లవారుజామున దారుణం జరిగింది. విజయపుర నుంచి 32 మంది ప్రయాణికులతో బెంగళూరు వెళ్తున్న ప్రైవేటు బస్సులో ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. నాలుగో నంబరు జాతీయ రహదారిపై జిల్లాలోని హరియూర్ తాలూకా కేఆర్ హళ్లి వద్ద ఈ  ప్రమాదం సంభవించింది.

మృతుల్లో  ఇద్దరు చిన్నారులు, ఓ మహిళ ఉన్నారు. ఇంజిన్‌లో లోపం వల్లే బస్సులో మంటలు చెలరేగినట్టు హరియూర్ ఎస్పీ రాధిక తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను వెంటనే జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

More Telugu News