టీవీ చానల్ రిపోర్టర్ మృతికి తీవ్ర విచారం వ్యక్తం చేసిన హరీశ్ రావు
- టీ న్యూస్ రిపోర్టర్ ప్రవీణ్ అకాల మరణం
- ఎంతో చురుకైన వ్యక్తి అంటూ కితాబిచ్చిన హరీశ్ రావు
- ప్రవీణ్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వెల్లడి
వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సమయంలో ప్రవీణ్ తో పరిచయం ఏర్పడిందని వెల్లడించారు. వార్తల సేకరణలో ప్రవీణ్ ఎంతో చురుకుగా ఉండేవాడని తెలిపారు. ప్రవీణ్ మృతి పట్ల అతని కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుకుంటున్నానని పేర్కొన్నారు.