TRS: ఎమ్మెల్సీ నారదాసు, ఆయన కుటుంబ సభ్యులకు కరోనా

  • నారదాసు ఇంట్లో మొత్తం 8 మందికి కరోనా
  • హైదరాబాద్‌లో చికిత్స పొందుతున్న నారదాసు కుటుంబం
  • పటాన్‌చెరు ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డికి కూడా పాజిటివ్
TRS MLC Naradasu Laxman and family Infected to Coronavirus

టీఆర్ఎస్ నేత, కరీంనగర్‌కు చెందిన ఎమ్మెల్సీ నారదాసు లక్షణ్ రావు, ఆయన కుటుంబ సభ్యులు కరోనా బారినపడ్డారు. లక్ష్మణ్ డ్రైవర్, ఇద్దరు గన్‌మన్లు, ఇంట్లోని పనివారికి కూడా కరోనా సంక్రమించినట్టు నిర్ధారణ అయింది. మొత్తం 8 మందికి కరోనా సోకినట్టు తేలింది. ప్రస్తుతం నారదాసు కుటుంబం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. కాగా, టీఆర్ఎస్‌కే చెందిన పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి కూడా నిన్న కరోనా బారినపడ్డారు.

More Telugu News