Telangana: తెలంగాణలో మరో 1,891 మందికి సోకిన కరోనా

coronavirus cases in telangana
  • మొత్తం కరోనా కేసుల సంఖ్య 66,677
  • ఆసుపత్రుల్లో 18,547 మందికి చికిత్స
  • 47,590  మంది డిశ్చార్జ్
  • మృతుల సంఖ్య మొత్తం 540
తెలంగాణలో కొవిడ్‌-19 విజృంభిస్తోంది. తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన వివరాల ప్రకారం.. రాష్ట్రంలో కొత్తగా 1,891 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. అదే సమయంలో 10 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు.  

ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 66,677కి చేరింది. ఆసుపత్రుల్లో 18,547 మందికి చికిత్స అందుతోంది. ఇప్పటివరకు 47,590  మంది డిశ్చార్జ్ అయ్యారు. మృతుల సంఖ్య మొత్తం 540కి చేరింది. జీహెచ్‌ఎంసీలో 517 మందికి కొత్తగా కరోనా సోకింది. కరోనా రికవరీ రేటు 71.3 శాతంగా ఉంది.

తెలంగాణలో కరోనా కేసుల పూర్తి వివరాలు..  
                              
Telangana
Corona Virus
COVID-19

More Telugu News