Somu Veerraju: ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడితో సోము వీర్రాజు భేటీ

  • మర్యాదపూర్వకంగా వెంకయ్యనాయుడు గారిని కలుసుకున్నానన్న వీర్రాజు
  • రామ్ మాధవ్ తో మంచి అనుబంధం ఉన్నట్టనిపిస్తుంటుంది
  • రామ్ మాధవ్ విజన్ స్ఫూర్తిదాయకం
Somu Veerraju meets Venkaiah Naidu

ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా ఎంపికైన తర్వాత సోము వీర్రాజు తొలిసారి ఢిల్లీకి వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడిని కలిశారు. రాష్ట్ర అధ్యక్షుడిగా తనను ప్రకటించిన తర్వాత ఉపరాష్ట్రపతి గారిని మర్యాద పూర్వకంగా కలవడం జరిగిందని ట్విట్టర్ ద్వారా ఆయన తెలిపారు. ఈ సమావేశానికి సంబంధించిన ఫొటోలను షేర్ చేశారు.

మరోవైపు బీజేపీ జాతీయ జనరల్ సెక్రటరీ రామ్ మాధవ్ ను కూడా సోము వీర్రాజు కలిశారు. ఈ భేటీకి సంబంధించి ఆయన ట్వీట్ చేస్తూ, 'రామ్ మాధవ్ ను ఎప్పుడు కలిసినా ఒక గొప్ప వ్యక్తితో నాకు మంచి అనుబంధం ఉన్నట్టు అనిపిస్తుంటుంది. దేశం, పార్టీ గురించి ఆయనకు ఉన్న విజన్ నాకు స్ఫూర్తిదాయకం' అని చెప్పారు.

More Telugu News