Priyanka Gandhi: ఢిల్లీలోని ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేసిన ప్రియాంకగాంధీ

  • ఆగస్ట్ 1లోగా బంగ్లాను ఖాళీ చేయాలన్న కేంద్రం
  • ప్రస్తుతం కొనసాగుతున్న కొత్త ఇంటి పనులు
  • కొంత కాలం గురుగ్రామ్ లోని ఓ ఇంట్లో ఉండనున్న ప్రియాంక
Priyanka Gandhi vacates bungalow

ఢిల్లీ లోధీ ఎస్టేట్ లోని ప్రభుత్వ బంగ్లాను కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకగాంధీ ఖాళీ చేశారు. ఆగస్ట్ 1వ తేదీ నాటికి బంగ్లాను ఖాళీ చేయాలంటూ కేంద్ర ప్రభుత్వం గడువు విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గడువులోగానే బంగ్లాను ఆమె ఖాళీ చేశారు. ఢిల్లీలో ప్రస్తుతం ఆమె కొత్త ఇంటి పనులు జరుగుతున్నాయి. ఆ ఇంట్లోకి వెళ్లేంత వరకు గురుగ్రామ్ లోని ఓ ఇంట్లో ఆమె ఉంటారని చెపుతున్నారు.

ప్రియాంకకు గత ఏడాది ఎస్పీజీ భద్రతను కేంద్రం తొలగించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమె జెడ్ ప్లస్ కేటగిరీలో ఉన్నారు. జెడ్ ప్లస్ కేటగిరీలో ఉన్న ప్రియాంకకు ప్రభుత్వ బంగ్లాను కేటాయించడం కుదరదని పేర్కొంటూ... ఆగస్ట్ 1 నాటికి బంగ్లాను ఖాళీ చేయాలని కేంద్ర గృహ, పట్టణాభివృద్ధి శాఖ ఆమెకు నోటీసులు జారీ చేసింది.

More Telugu News