Revanth Reddy: తల్లి ముందే కొడుకు మృతి... ఈ మనిషిలో కనికరం లేదంటూ సీఎం కేసీఆర్ పై రేవంత్ ఆగ్రహం

  • నల్గొండ జిల్లాలో విషాద ఘటన
  • కరోనాతో యువకుడి మృతి
  • ఈ నిర్లక్ష్యానికి అంతమెప్పుడు? అంటూ రేవంత్ ఆవేదన
Revanth Reddy fires on CM KCR over a corona death

నల్గొండ జిల్లా మాడ్గులపల్లి సల్కునూరుకు చెందిన ఓ యువకుడు కరోనాతో ఆసుపత్రిలో చేరగా, అప్పటికే అతని పరిస్థితి విషమించడంతో తల్లి కళ్ల ముందే ఆ కొడుకు కన్నుమూశాడు. తనబిడ్డకు వెంటిలేటర్ అమర్చాలని ఆ తల్లి ఆసుపత్రిలో కనిపించిన వాళ్లందరినీ వేడుకున్నా ఫలితం లేకపోయింది. అక్కడే ఉన్న నెబ్యులైజర్ సాయంతో తన బిడ్డను బతికించుకునేందుకు ఆ తల్లి పడిన తాపత్రయం అందరినీ కలచివేసింది. కానీ కొన్ని నిమిషాల్లో తన కొడుకు విగతజీవుడిలా మారడంతో ఆ మాతృమూర్తి గుండెలవిసేలా రోదించింది. ఈ ఘటనపై కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి స్పందించారు.

నిత్య హృదయవిదారక దృశ్యం అంటూ ఆ తల్లి రోదనలతో కూడిన వీడియో పోస్టు చేశారు. కరోనాతో విలవిలలాడుతూ కళ్లముందే ప్రాణాలు వదిలిన వైనం... అయినా సీఎం కేసీఆర్ మనసు కరగడంలేదు... ఈ మనిషిలో కనికరం లేదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నిర్లక్ష్యానికి అంతమెప్పుడు? అంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.


More Telugu News