మరో ఇద్దరు ఎమ్మెల్యేలపై కాంగ్రెస్ బహిష్కరణ వేటు.. రాజస్థాన్‌లో రంజుగా రాజకీయం

Congress suspended another two MLAs
  • భన్వర్‌లాల్ శర్మ, విశ్వేంద్రసింగ్‌ల ప్రాథమిక సభ్యత్వాల రద్దు
  • కోర్టులో విచారణ జరుగుతున్న సమయంలోనే వేటు
  • పైలట్ వెనక్కి వస్తే ఆహ్వానించేందుకు కాంగ్రెస్ సిద్ధం
చూస్తుంటే రాజస్థాన్‌లో నెలకొన్న రాజకీయ సంక్షోభం ఇప్పట్లో తొలగిపోయేలా కనిపించడం లేదు. తిరుగుబాటు నేత సచిన్ పైలట్ వర్గంలోని మరో ఇద్దరు ఎమ్మెల్యేలు భన్వర్‌లాల్ శర్మ, విశ్వేంద్రసింగ్‌ల ప్రాథమిక సభ్యత్వాలను రద్దు చేసిన కాంగ్రెస్ వారిద్దరికీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. సచిన్ పైలట్ సహా 19 మంది ఎమ్మెల్యేలపై రాజస్థాన్ హైకోర్టులో దాఖలైన వ్యాజ్యంపై నిన్న విచారణ జరుగుతున్న సమయంలోనే కాంగ్రెస్ వీరిద్దరినీ బహిష్కరించడం గమనార్హం.

మరోవైపు, పైలట్‌కు కాంగ్రెస్ ద్వారాలు ఇంకా తెరిచే ఉంచింది. పదవుల నుంచి తప్పిస్తూ తనకు ఇచ్చిన నోటీసులపై పైలట్ కోర్టుకెక్కినప్పటికీ, ఆయన వెనక్కి వస్తే తిరిగి అక్కున చేర్చుకునేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. పైలట్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేయొద్దంటూ ముఖ్యమంత్రి గెహ్లాట్‌కు అధిష్ఠానం సూచించినట్టు సమాచారం. కాగా, దక్షిణాదికి చెందిన ఓ నేతతో పైలట్ సంప్రదింపులు జరపగా, ప్రస్తుత పరిణామాలను మరిచిపోయి ఆహ్వానించేందుకు పార్టీ సిద్ధంగా ఉందని, పార్టీలో ఆయనకు మునుపటి గౌరవం ఉంటుందని ఆ నేత చెప్పినట్టు తెలిసింది.
Go Back to Shorts
Congress
Rajasthan
Sachin pilot

More Telugu News