Corona Virus: దేశంలో తొలిసారి ఒక్కరోజులో 29 వేలకు పైగా కరోనా కేసులు

  • గత 24 గంటల్లో 29,429 మందికి కొత్తగా కరోనా
  • కరోనా కేసుల సంఖ్య మొత్తం 9,36,181
  • మృతుల సంఖ్య మొత్తం 24,309
  • 3,19,840 మందికి ఆసుపత్రుల్లో చికిత్స  
Over 29000 cases in India in 24 hours for first time

భారత్‌లో కొవిడ్‌-19 వైరస్ కేసుల విజృంభణ కొనసాగుతోంది. కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం తెలిపిన వివరాల ప్రకారం.. గత 24 గంటల్లో భారత్‌లో 29,429 మందికి కొత్తగా కరోనా సోకింది. ఒక్కరోజులో నమోదైన అత్యధిక కేసులు ఇవే. అదే సమయంలో 582 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు.
     
దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 9,36,181కి చేరగా, మృతుల సంఖ్య మొత్తం 24,309కి పెరిగింది. 3,19,840 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 5,92,032 మంది కోలుకున్నారు.
                                                                                       
కాగా, నిన్నటి వరకు దేశంలో మొత్తం 1,24,12,664 శాంపిళ్లను పరీక్షించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న ఒక్కరోజులో 3,20,161 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.

More Telugu News