తెలంగాణలో కొనసాగుతున్న కరోనా మరణ మృదంగం.. నిన్న ఏడుగురి బలి!
- 24 గంటల వ్యవధిలో 1,410 కేసుల నమోదు
- జీహెచ్ఎంసీ పరిధిలో 918 కేసులు
- రాష్ట్రంలో 30 వేల మార్క్ దాటేసిన కరోనా కేసులు
నిన్న నమోదైన కేసుల్లో ఎప్పటిలానే జీహెచ్ఎంసీ పరిధిలోనే అత్యధిక కేసులు నమోదయ్యాయి. ఇక్కడ మొత్తం 918 కేసులు నమోదు కాగా, ఆ తర్వాత అత్యధిక కేసులు నమోదైన జిల్లాల్లో రంగారెడ్డి (125), సంగారెడ్డి (79), మేడ్చల్ (67), వరంగల్ అర్బన్ (34), కరీంనగర్ (32), భద్రాద్రి కొత్తగూడెం (23), నల్గొండ (21), నిజామాబాద్ (18) మెదక్ (17), ఖమ్మం (12) సూర్యాపేట (10) ఉన్నాయి. ఇక, పెద్దపల్లి, ఆదిలాబాద్, వికారాబాద్, జనగామ, ములుగు, వనపర్తి, సిద్ధిపేటలలో ఒక్కో కేసు నమోదైంది.


.