చైనా అండతో రెచ్చిపోతున్న నేపాల్.. భారతీయ టీవీ చానళ్ల బంద్!
- భారత టీవీ చానళ్లను ఆపేస్తున్నట్టు ప్రకటించిన నేపాల్ కేబుల్ ఆపరేటర్లు
- స్వచ్ఛందంగానే నిర్ణయం తీసుకున్నామని ప్రకటన
- అధికార పార్టీ నేత ప్రకటించిన గంటల వ్యవధిలోనే నిర్ణయం
ప్రధాని కేపీ ఓలీ శర్మకు వ్యతిరేకంగా ప్రసారమవుతున్న కార్యక్రమాలను నిషేధించాలని ఆ దేశ మాజీ డిప్యూటీ ప్రధాని, అధికార పార్టీ ప్రతినిధి నారాయణ కాజీ శ్రేష్ఠ ఈ ఉదయం ప్రకటించారు. ఈ ప్రకటన వెలువడిన గంటల వ్యవధిలోనే నేపాల్ కేబుల్ ఆపరేటర్లు భారత చానళ్లను ఆపేశారు.