India: భారత్‌లో 24,879 మందికి కొత్తగా కరోనా

  • మొత్తం కేసులు 7,67,296
  • మృతుల సంఖ్య మొత్తం 21,129
  • 2,69,789 మందికి ఆసుపత్రుల్లో చికిత్స
  • కోలుకున్న వారు 4,76,378 మంది  
India reports the highest single day spike of 24879 new COVID19 cases

దేశంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం తెలిపిన వివరాల ప్రకారం.. గత 24 గంటల్లో భారత్‌లో 24,879 మందికి కొత్తగా కరోనా సోకిందని  తెలిపింది. అదే సమయంలో 487 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు.
     
దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 7,67,296కి చేరగా, మృతుల సంఖ్య మొత్తం 21,129కి పెరిగింది. 2,69,789 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 4,76,378 మంది కోలుకున్నారు.
                             
నిన్నటి వరకు దేశంలో మొత్తం 1,07,40,832 శాంపిళ్లను పరీక్షించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న ఒక్కరోజులో 2,67,061 శాంపిళ్లను పరీక్షించినట్లు వివరించింది.

More Telugu News