vishal: డబ్బు కొట్టేస్తోన్న యువ‌తిపై హీరో విశాల్ కేసు

  • గత ఆరేళ్లలో మొత్తం కలిపి 45 లక్షల రూపాయలకు పైగా మోసం
  • విశాల్ సంస్థలో పని చేస్తూ సంపాదించిన యువతి
  • ఆ డబ్బుతో ఇటీవలే ఓ ఇల్లు కొన్న వైనం
vishan files case on a girl

సినీనటుడు విశాల్‌ నిర్మాత‌గాను పలు సినిమాలు తీస్తోన్న విషయం తెలిసిందే. అయితే, ఆయన  ఓ యువతిపై ఫిర్యాదు చేయాల్సి వచ్చింది. తాను తన బ్యానర్‌లో చక్ర సినిమా తీస్తుండగా ఆమె పాల్పడిన మోసాలు బయటపడ్డాయని తెలిపాడు.

ఆ మహిళ గత ఆరేళ్లలో మొత్తం కలిపి 45 లక్షల రూపాయలకు పైగా మోసం చేసింది. ఈ విషయం ఇటీవలే విచార‌ణ‌లో తేలింది. విశాల్ సంస్థలో పని చేస్తూ మోస పూరితంగా సంపాదించిన ఆ డబ్బుతో ఆమె ఓ ఇల్లు కూడా కొనడం గమనార్హం.

ఈ విష‌యంపై విశాల్ బ్యానర్ ప్రొడక్షన్ హౌస్ మేనేజర్ తాజాగా చెన్నైలోని ఓ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం విశాల్  చ‌క్ర సినిమాలో నటిస్తున్నాడు.

ఎంఎస్ ఆనందన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ఫస్ట్‌లుక్ ఇటీవలే విడుదలైంది. చేతిలో చక్రంతో ఉన్న ఈ సినిమాలో ఆయన ఫస్ట్‌లుక్‌కు మంచి స్పందన వచ్చింది. విశాల్ సరసన ఈ సినిమాలో శ్రద్ధాశ్రీనాథ్‌ నటిస్తోంది. ఇందులో ఓ కీలక  పాత్రలో రెజీనా కూడా నటిస్తోంది.

More Telugu News