Village Volunteer: వృద్ధులు, వికలాంగుల పింఛన్ సొమ్ముతో పరారైన గ్రామ వాలంటీర్

  • అనంతపురం జిల్లా పెనుకొండ మండలం కొండపల్లిలో ఘటన
  • రూ. 63 వేలతో పరారైన గ్రామ వాలంటీర్
  • స్విచ్చాఫ్ వస్తున్న ఫోన్
Village Volunteer escapes with pension cash

వృద్ధులు, వికలాంగులకు ఇవ్వాల్సిన పింఛన్ సొమ్మును తీసుకుని గ్రామ వాలంటీర్ పరారైన ఘటన అనంతపురం జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే ఈ ఘటన పెనుకొండ మండలం కొండపల్లిలో జరిగింది. ఈ నెలకు సంబంధించి గ్రామంలో 49 మందికి పింఛన్ అందాల్సి ఉంది. గ్రామ సచివాలయం వెల్ఫేర్ అధికారి హీరా నుంచి పింఛన్ కు సంబంధించిన రూ. 63 వేల సొమ్మును వాలంటీర్ నాయక్ తీసుకున్నాడు.

ఒకటో తారీఖునే ఈ డబ్బు లబ్ధిదారులకు అందాల్సి ఉంది. అయితే ఆ సొమ్ము అందకపోవడంతో... వారు ఆరా తీశారు. దీంతో, అసలు విషయం వెలుగులోకి వచ్చింది. డబ్బుతో పాటు వాలంటీర్ పరారైనట్టు తెలిసింది. అతనికి ఫోన్ చేస్తే స్విచ్చాఫ్ వస్తోంది. దీంతో అతనిపై గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

More Telugu News