Atchannaidu: అచ్చెన్నాయుడు బెయిల్ పిటిషన్ పై విచారణకు కరోనా దెబ్బ!

  • అచ్చెన్న బెయిల్ పిటిషన్ పై విచారణ జూలై 1కి వాయిదా
  • రాష్ట్రంలో కరోనా విజృంభణ
  • జూన్ 30 వరకు కోర్టు పనుల నిలిపివేత
Atchannaidu bail plea will be hearing on July First

ఏపీలో కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉన్న సంగతి తెలిసిందే. ఒకట్రెండు జిల్లాలు మినహాయించి అన్ని జిల్లాల్లో భారీగా కరోనా పాజిటివ్ కేసులు వెల్లడవుతున్నాయి. ఈ నేపథ్యంలో న్యాయస్థానాల కార్యకలాపాలను ఈ నెల 30 వరకు నిలిపివేశారు. దాంతో టీడీపీ నేత అచ్చెన్నాయుడు బెయిల్ పిటిషన్ పై విచారణను ఏసీబీ కోర్టు వాయిదా వేసింది. కొవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో కోర్టు పనులు నిలిచిపోయాయని, అందుకే జూలై 1న బెయిల్ పిటిషన్ విచారిస్తామని వెల్లడించింది. అచ్చెన్నాయుడికి ఇటీవలే మూడ్రోజుల ఏసీబీ కస్టడీ ముగిసింది.

More Telugu News