Guntur District: పురివిప్పిన పాత కక్షలు.. గుంటూరు జిల్లాలో టీడీపీ కార్యకర్త దారుణ హత్య

  • బైక్‌పై వెళ్తుండగా మారణాయుధాలతో దాడి
  • అక్కడికక్కడే మృతి చెందిన విక్రమ్
  • తీవ్రంగా గాయపడిన మరో ఇద్దరిని ఆసుపత్రికి తరలించిన పోలీసులు
TDP Activist murdered in Guntur dist

గుంటూరు జిల్లా గురజాల మండలంలో పాతకక్షలకు ఓ టీడీపీ కార్యకర్త బలయ్యాడు. పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని అంబాపురానికి చెందిన టీడీపీ కార్యకర్త దోమతోటి విక్రమ్ గత అర్ధరాత్రి బైక్‌పై వెళ్తుండగా మాటువేసిన ప్రత్యర్థులు మారణాయుధాలతో దాడిచేశారు.

ఈ ఘటనతో తీవ్రంగా గాయపడిన విక్రమ్ అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పాతకక్షలే ఈ ఘటనకు కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు.

More Telugu News