Corona Virus: ఏపీలో కరోనా విలయం... ఒక్కరోజే 10 మంది మృతి

Ten people dies of corona virus in AP
షార్ట్స్‌లో చూడండి
ఏపీలో కరోనా వైరస్ వ్యాప్తి వేగం పుంజుకుంది. దాదాపు అన్ని జిల్లాల్లో పెద్ద సంఖ్యలో కేసులు నమోదవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. గడచిన 24 గంటల్లో రాష్ట్రంలో 605 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. వారిలో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు 34 మంది కాగా, విదేశాల నుంచి వచ్చిన వారిలో ఒకరికి పాజిటివ్ అని తేలింది. మిగిలిన 570 లోకల్ కేసులే. ఈ నేపథ్యంలో ఏపీలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 11,489కి చేరింది. తాజాగా, 191 మంది డిశ్చార్జి కాగా, ఇప్పటివరకు 5,196 మంది కోలుకున్నట్టయింది. మరో 6,147 మంది చికిత్స పొందుతున్నారు.

ఇక, రాష్ట్రంలో మరణాల రేటు క్రమంగా పెరుగుతోంది. తాజాగా 10 మంది మృత్యువాత పడ్డారు. కర్నూలు జిల్లాలో నలుగురు, కృష్ణా జిల్లాలో నలుగురు, గుంటూరు జిల్లాలో ఒకరు, విశాఖ జిల్లాలో ఒకరు మరణించారు. దాంతో ఏపీలో కరోనా మృతుల సంఖ్య 146కి పెరిగింది.
Go Back to Shorts
Corona Virus
Deaths
Andhra Pradesh
Positive
Discharge

More Telugu News