exams: డిగ్రీ, పీజీ పరీక్షలు కూడా రద్దు?... జగన్‌తో మంత్రి సురేశ్ కీలక భేటీ!

  • ఇప్పటికే పది, ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షల రద్దు 
  • పరీక్షలు లేకుండానే విద్యార్థులు పాస్
  • ఉన్నతాధికారులతో జగన్ కీలక చర్చలు
degree exams cancels in ap

కరోనా వ్యాప్తి ఉద్ధృతంగా ఉండడంతో ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పరీక్షలతో పాటు ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షలను రద్దు చేసిన విషయం తెలిసిందే. పరీక్షలు లేకుండానే ఆ విద్యార్థులను పాస్ చేశారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో డిగ్రీ, పీజీ పరీక్షల రద్దుపై కూడా ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. ఈ విషయంపై సీఎం జగన్ నిర్వహిస్తోన్న సమావేశంలో మంత్రి ఆదిమూలపు సురేశ్, ఉన్నతాధికారులు సమావేశమయ్యారు.

తాడేపల్లిలోని సీఎం క్యాంపు ఆఫీసులో జరుగుతోన్న ఈ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకుని, అనంతరం దీనిపై మంత్రి సురేశ్ ప్రకటన చేసే అవకాశం ఉంది. ఏపీలో కరోనా కేసుల ఉద్ధృతి తగ్గని నేపథ్యంలో ఈ పరీక్షలనూ రద్దు చేసే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

More Telugu News