Rakul Preet Singh: తొమ్మిదేళ్ల క్రితం అమ్మానాన్నలను వదిలి.. సొంత ప్రయాణాన్ని ప్రారంభించా: రకుల్ ప్రీత్ సింగ్

  • దక్షిణాదిలో పూర్తి చేయాల్సిన సినిమాలు ఉన్నాయి
  • ఓ హిందీ సినిమాకు కూడా సంతకం చేశాను
  • ఎంతో కష్టపడి ఈ స్థాయికి చేరుకున్నా
9 years back I started my own journey says Rakul Preet Singh

లాక్ డౌన్ కారణంగా ముంబైలోనే ఉండిపోయానని... ఇటీవలే గుర్గావ్ లోని తన ఇంటికి చేరుకున్నానని సినీ నటి రకుల్ ప్రీత్ సింగ్ తెలిపింది. పరిస్థితులు చక్కబడిన తర్వాత హైదరాబాదుకు వస్తానని చెప్పింది. దక్షిణాదిలో తాను పూర్తి చేయాల్సిన సినిమాలు ఉన్నాయని తెలిపింది. ఓ హిందీ సినిమాకు కూడా సంతకం చేశానని... ఈ నేపథ్యంలో సినిమాల మధ్య డేట్లు క్లాష్ కాకుండా చూసుకోవాల్సి ఉందని చెప్పింది. హిందీ సినిమా షూటింగ్ ప్రారంభం కాకముందే దక్షిణాది సినిమాల చిత్రీకరణ ప్రారంభమైతే బాగుంటుందని తెలిపింది. రెండూ ఒకేసారి ప్రారంభమైతే డేట్లు అడ్జస్ట్ చేయడం తనకు చాలా కష్టమవుతుందని చెప్పింది.    
 
తన జీవితంలో ఉన్నతమైన లక్ష్యాలను సాధించాలనే తపనతో తొమ్మిదేళ్ల క్రితం అమ్మానాన్నలను వదిలి సొంత ప్రయాణాన్ని ప్రారంభించానని రకుల్ తెలిపింది. ఎన్నో కష్టాలను ఎదుర్కొంటూ, అడ్డంకులను అధిగమించుకుంటూ ఈ స్థాయికి చేరుకున్నానని చెప్పింది. చాలా కాలం తర్వాత ఇప్పుడు అమ్మానాన్నలతో సంతోష సమయాన్ని గడుపుతున్నానని తెలిపింది. ఇంటికి వచ్చిన తర్వాత మళ్లీ బాల్యంలోకి అడుగుపెట్టినట్టు ఉందని చెప్పింది. తాను చేసిన వంటను రుచి చూసి చాలా బాగుందని అమ్మానాన్నలు మెచ్చుకున్నారని తెలిపింది.

More Telugu News