Rahul Gandhi: ఈ విషయాలు ఇప్పుడు స్పష్టమయ్యాయి: చైనాతో ఉద్రిక్తతపై రాహుల్ గాంధీ

  • ముందస్తు ప్రణాళిక ప్రకారమే గాల్వన్‌లో చైనా దాడి
  • భారత ప్రభుత్వం మొద్దు నిద్రపోయింది
  • మన జవాన్లు మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది 
Its now crystal clear says rahul

తూర్పు లడఖ్‌లో భారత్‌-చైనా మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఈ విషయంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పందిస్తూ పలు వ్యాఖ్యలు చేశారు. 'ఈ కింది విషయాలు ఇప్పుడు స్ఫష్టమయ్యాయి. 1. గాల్వన్‌లో చైనా చేసిన దాడి ముందస్తు ప్రణాళిక ప్రకారమే జరిగింది. 2. భారత ప్రభుత్వం  ఈ సమస్యను పట్టించుకోకుండా మొద్దు నిద్రపోయింది. 3. దీంతో మన వీర జవాన్లు మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది' అని ఆయన ట్వీట్ చేశారు.

ఈ సందర్భంగా కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి శ్రీపాద్ నాయక్ చేసిన వ్యాఖ్యలను ఆయన పోస్ట్ చేశారు. చైనా ముందస్తు ప్రణాళిక ప్రకారమే ఈ దాడి జరిగిందని ఆయన ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఇది దేశ భద్రతకు సంబంధించిన అంశమని, తాము రాజీపడబోమని ఆయన అన్నారు. మన భూభాగాన్ని ఆక్రమించుకునే అవకాశాన్ని తాము ఇవ్వబోమని చెప్పారు.

More Telugu News