Jagan: రాజ్యసభ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకున్న సీఎం జగన్

  • ఏపీలో నాలుగు స్థానాలకు ఎన్నికలు
  • వెలగపూడిలోని అసెంబ్లీ హాలులో పోలింగ్
  • మధ్యాహ్నం ఓటు హక్కు వినియోగించుకోనున్న చంద్రబాబు
jagan casts vote

ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన నాలుగు రాజ్యసభ స్థానాలకు వెలగపూడిలోని అసెంబ్లీ హాలులో పోలింగ్ జరుగుతోంది. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఓటు హక్కును వినియోగించుకున్నట్లు వైసీపీ తెలిపింది. ఈ ఎన్నికల్లో వైసీపీ నుంచి ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌, పరిమళ్‌ నత్వానీ, మోపిదేవి వెంకటరమణ, టీడీపీ నుంచి వర్ల రామయ్య పోటీ చేస్తున్నారు.

ఇప్పటికే పలువురు వైసీపీ ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ రోజు మధ్యాహ్నం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడితో పాటు ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈ రోజు సాయంత్రం ఎన్నికల ఫలితాలు వెల్లడవుతాయి.

More Telugu News