Andhra Pradesh: కొత్త రాజధానిలో మౌలిక వసతుల కోసం రూ. 500 కోట్లు.. ఏపీ బడ్జెట్ పార్ట్ 3

  • గ్రామ సచివాలయాల కోసం రూ. 1633 కోట్లు
  • డాక్టర్‌ వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ కోసం రూ. 2100 కోట్లు
  • సాగునీటి పారుదల శాఖకు రూ.11,805 కోట్లు
16710 cr allocated to rural development in AP Budget

2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను ఏపీ ప్రభుత్వం భారీ బడ్జెట్ ను అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. రూ. 2,24,789.18 కోట్లతో ప్రవేశపెట్టిన బడ్జెట్ లో రైతు సంక్షేమం, ఆరోగ్యానికి ప్రాధాన్యతను ఇచ్చారు. వివిధ పథకాలకు కేటాయించిన బడ్జెట్ వివరాలు ఇవే...

  • ఎస్సీ, ఎస్టీ గృహాల ఉచిత విద్యుత్‌కు రూ.425.93 కోట్లు
  • 104, 108 వాహన సేవలకు రూ.470.29 కోట్లు
  • గ్రామీణాభివృద్ధికి రూ.16,710 కోట్లు
  • రవాణా రంగానికి రూ.6,588 కోట్లు
  • డాక్టర్‌ వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ కోసం రూ. 2100 కోట్లు
  • సాగునీటి పారుదల శాఖకు రూ.11,805 కోట్లు
  • కొత్త రాజధానిలో మౌలిక వసతుల కోసం రూ. 500 కోట్లు
  • ప్రతిభ స్కాలర్‌షిప్స్‌ కోసం రూ. 10.54 కోట్లు
  • నేషనల్‌ హార్టీకల్చర్‌ మిషన్‌ రూ. 150.99 కోట్లు
  • పట్టణ స్వయం సహాయక బృందాల కోసం రూ. 389.89 కోట్లు
  • నేషనల్‌ హెల్త్‌ మిషన్‌ కోసం రూ. 1808.03 కోట్లు
  • గ్రామ సచివాలయాల కోసం రూ. 1633 కోట్లు
  • అమరావతి-అనంతపురం నేషనల్‌ హైవే కోసం రూ. 100 కోట్లు
  • వైఎస్సార్‌ గృహ వసతి కోసం రూ. 3 వేల కోట్లు
  • డ్రగ్స్‌, మందుల కేంద్రీకృత కొనుగోళ్ల కోసం రూ. 400 కోట్లు
  • రైతులకు విత్తనాల పంపిణీ కోసం రూ.200 కోట్లు
  • జగనన్న విద్యాకానుక కోసం రూ.500 కోట్లు
  • ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్‌ మీడియం కోసం రూ. 55.15 కోట్లు
  • రైతులకిచ్చే నష్ట పరిహారం కోసం రూ. 20 కోట్లు
  • కుటుంబ సంక్షేమ కేంద్రాల కోసం రూ. 242.15 కోట్లు
  • వ్యవసాయ మార్కెట్ల మౌలిక సదుపాయాల నిధి రూ. 100 కోట్లు
  • అగ్రిగోల్డ్‌ బాధితులకు రూ.200 కోట్లు

More Telugu News