Vijay Sai Reddy: దొరకకుండా దాక్కోవడానికి తండ్రీకొడుకులు కొత్త ప్రదేశాన్ని వెతుక్కుంటున్నారు: విజయసాయిరెడ్డి

  • చంద్రబాబు, లోకేశ్‌పై పరోక్షంగా విమర్శలు
  • లాక్‌డౌన్‌లో తండ్రీకొడుకులు హైదరాబాద్‌లో ఉన్నారు
  • ఆ ప్రాంతమే సురక్షితమైందని భావించారు
The father son duo believed that Hyderabad would be the safest shelter during lockdown Now they are looking for a new bolthole

టీడీపీ నేత అచ్చెన్నాయుడిని ఏసీబీ అధికారులు అరెస్టు చేసి తీసుకెళ్లిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దర్యాప్తు బృందాలకు దొరకకుండా ఉండేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు నారా లోకేశ్‌ ప్రయత్నాలు జరుపుతున్నారంటూ వారి పేర్లను ప్రస్తావించకుండా వైసీపీ నేత విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు. 'లాక్‌డౌన్‌లో ఈ తండ్రీకొడుకులు హైదరాబాదే సురక్షితమైన ప్రాంతమని భావించారు. ఇప్పుడు దర్యాప్తు బృందాలకు దొరకకుండా ఉండేందుకు దాక్కోవడానికి వారిద్దరు కొత్త ప్రదేశాన్ని వెతుక్కుంటున్నారు'  అని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.

More Telugu News