కరోనా లక్షణాలు కనిపించిన మూడు రోజుల తర్వాత టెస్టు చేయించడమే బెటర్: అధ్యయనం

john hopkins university says do covid tests after 3 three days
  • జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీ పరిశోధన
  • 67 శాతం నెగటివ్ ఫలితాలు
  • అధ్యయనంలో భాగంగా 1,330 మంది రోగుల నమూనాల విశ్లేషణ
కరోనా లక్షణాలు కనిపించిన వెంటనే కాకుండా మూడు నాలుగు రోజులు ఆగి పరీక్షలు చేయించుకోవడం మంచిదని ఓ అధ్యయనం పేర్కొంది. లక్షణాలు కనిపించిన వెంటనే చేయించుకుంటే తప్పుడు ఫలితాలు వచ్చే అవకాశం ఉందని అమెరికాలోని జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీ శాస్త్రవేత్తల అధ్యయనంలో వెల్లడైంది. అధ్యయనంలో భాగంగా 1,330 మంది రోగుల నమూనాలను విశ్లేషించిన తర్వాత ఈ విషయంలో ఓ నిర్ధారణకు వచ్చినట్టు శాస్త్రవేత్త లారెన్ కౌసిర్కా తెలిపారు.

కోవిడ్ రోగులకు ఆర్‌టీ-పీసీఆర్ పరీక్షలు నిర్వహించేటప్పుడు ముక్కు, గొంతులోని ద్రవాలను సేకరించడంతోపాటు లక్షణాలు ఎప్పుడు మొదలయ్యాయన్నది కూడా నమోదు చేస్తారని పేర్కొన్నారు. ఈ సమాచారం ఆధారంగా వైరస్ సోకిన నాలుగు రోజుల తర్వాత పరీక్ష చేస్తే 67 శాతం ఫలితాలు నెగటివ్‌గా వచ్చినట్టు తెలిపారు. అయితే, లక్షణాలు కనిపించిన ప్రతి ఒక్కరికీ వైరస్ సోకినట్టుగానే భావించి చికిత్స చేయాలని సూచించారు.
Go Back to Shorts
john hopkins university
america
COVID-19
Test

More Telugu News