IISC: కరోనా వైరస్ చైనా నుంచి మనకు రాలేదు: తేల్చిచెప్పిన అధ్యయనం

  • భారతీయ విజ్ఞాన సంస్థ అధ్యయనంలో వెల్లడి
  • యూరప్, మధ్య ప్రాచ్య దేశాల నుంచి దేశంలోకి దిగుమతి
  • వైరస్ మూలాలపై స్పష్టత
Corona virus not came from China says a Study

భారత్‌లోకి కరోనా వైరస్ చైనా నుంచి రాలేదని, అది యూరప్, మధ్య ప్రాచ్య, దక్షిణాసియా దేశాల నుంచి వచ్చిందని ఓ అధ్యయనంలో తేలింది. దేశంలోకి కరోనా వైరస్ ఎక్కడి నుంచి వచ్చిందన్న విషయాన్ని తెలుసుకునేందుకు బెంగళూరుకు చెందిన భారతీయ విజ్ఞాన సంస్థ (ఐఐఎస్‌సీ) చేసిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. దేశంలో వ్యాప్తిస్తున్న కరోనా వైరస్ మూలాలపై ఈ అధ్యయనంలో స్పష్టత లభించినట్టు ఆ సంస్థ మైక్రో బయాలజీ, సెల్ బయాలజీ విభాగాలకు చెందిన శాస్త్రవేత్తలు మైనక్ మండల్, కుమారవేల్ సోమసుందరమ్, అంకిత లావార్డెలు తెలిపారు.

More Telugu News