Divya: వ్యభిచారంలో పోటీ... విశాఖలో దివ్య హత్యకు కారణం అదేనా?

  • విశాఖలో అత్యంత పాశవిక రీతిలో హత్యకు గురైన దివ్య
  • అందగత్తె కావడంతో దివ్యకు విపరీతమైన డిమాండ్!
  • అసూయతో ఆమెను అంతమొందించిన వైనం
Ego causes death of Divya

విశాఖపట్నంలో అత్యంత పాశవికమైన రీతిలో హత్యకు గురైన దివ్య వ్యవహారంలో ఆసక్తికర అంశం వెల్లడైంది. వ్యభిచారంలో ఏర్పడిన పోటీనే దివ్యను చంపడానికి కారణమని తెలిసింది. అసలేం జరిగిందంటే... తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలానికి చెందిన దివ్య కుటుంబ సభ్యులు చనిపోవడంతో పిన్ని క్రాంతివేణి ఇంటికి చేరింది. అయితే, దివ్య అందమే శాపమైంది. డబ్బుకు ఆశపడిన క్రాంతివేణి కూతురు వరసైన దివ్యను కుమారి అనే యువతికి అప్పగించింది. కుమారి... దివ్యతో వ్యభిచారం చేయించేది. కొన్నాళ్ల తర్వాత దివ్యను వసంత అనే మహిళ కొనుక్కుంది.

వసంత సోదరి మంజు కూడా ఆమె ఇంటికి దగ్గర్లోనే ఉండేది. భర్త చనిపోవడంతో ఆమె సంజయ్ అనే యువకుడితో సహజీవనం చేస్తోంది. వీరందరూ వ్యభిచార వృత్తిలో ఉన్నవారే! అయితే దివ్య అందగత్తె కావడంతో వసంత, మంజు కంటే ఆమె వద్దకే విటులు ఎక్కువ మంది వెళ్లేవారు. దాంతో దివ్య సంపాదన వాళ్లందరికంటే అధికంగా ఉండేది. ఇది ఓ రకంగా వసంత, మంజు, సంజయ్ లకు కంటగింపుగా మారింది. అంతేకాదు, ఆ డబ్బు పంపకాల్లోనూ దివ్య ఎక్కువ వాటా అడుగుతుండడంతో మర్డర్ స్కెచ్ వేశారు. ఉన్నపళాన చంపేస్తే హత్య అని తెలుస్తుందని, చిత్రహింసలు పెట్టి చంపాలని ప్లాన్ చేసి పక్కాగా అమలు చేశారు. కానీ, వ్యాన్ డ్రైవర్ ఇచ్చిన సమాచారంతో అందరూ దొరికిపోయారు.

More Telugu News