Senior Officer: ఢిల్లీలోని ఏపీ భవన్ కు తాకిన కరోనా సెగ... సీనియర్ అధికారికి కరోనా పాజిటివ్

  • ఢిల్లీలో కరోనా విజృంభణ
  • ఏపీ, తెలంగాణ రెసిడెంట్ కమిషనర్ కార్యాలయాల మూసివేత
  • శానిటైజ్ చేసి రెండ్రోజుల తర్వాత తెరవాలని నిర్ణయం
Senior official at Delhi AP Bhavan tested corona positive

దేశ రాజధాని ఢిల్లీలో కరోనా బీభత్సం కొనసాగుతోంది. నిత్యం పెద్ద సంఖ్యలో కేసులతో ఢిల్లీలో పరిస్థితి ఆందోళనకరంగా తయారైంది. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని ఏపీ భవన్ లో ఓ సీనియర్ అధికారి కరోనా బారినపడ్డారు.

ఈ నేపథ్యంలో ఏపీ, తెలంగాణ రెసిడెంట్ కమిషనర్ కార్యాలయాలు మూసివేశారు. కరోనా ప్రోటోకాల్ ప్రకారం ఆ కార్యాలయాలను శానిటైజ్ చేసి రెండ్రోజుల తర్వాత తెరవాలని నిర్ణయించారు. ఢిల్లీలో ఇప్పటివరకు 27,654 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 761 మంది మరణించారు.

More Telugu News