Revanth Reddy: ముందుంది మొసళ్ల పండుగ... టీఆర్ఎస్ నేతలకు దీటుగా బదులిచ్చిన రేవంత్ రెడ్డి

  • రేవంత్ ఐరన్ లెగ్ అంటూ వ్యాఖ్యానించిన టీఆర్ఎస్ నేతలు
  • ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ నాశనం అని వెల్లడి
  • వెనుకంజ వేసేది లేదంటూ సంకేతాలు పంపిన రేవంత్
Revanth Reddy warns TRS leaders

జన్ వాడలో మంత్రి కేటీఆర్ అక్రమంగా ఫాంహౌస్ నిర్మిస్తున్నారంటూ కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ఆరోపిస్తుండడం టీఆర్ఎస్ నేతలను తీవ్ర ఆగ్రహానికి గురిచేస్తోంది. దానికితోడు ఈ వ్యవహారంలో విచారణ కోసం ఎన్జీటీ ఓ కమిటీ వేయడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ మధ్యాహ్నం వారు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి రేవంత్ పై నిప్పులు చెరిగారు.

రేవంత్ రెడ్డి ఐరన్ లెగ్ అని, రేవంత్ ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ సర్వనాశనం అవుతుందని వ్యాఖ్యానించారు. రేపటి నుంచి రేవంత్ బాగోతాలు ఒక్కొక్కటిగా బయటికి వస్తాయని హెచ్చరించారు. అయితే, దీనిపై రేవంత్ దీటుగా స్పందించారు. "ముందుంది మొసళ్ల పండుగ... రేపు మధ్యాహ్నం 1 గంటకు!" అంటూ ఈ వ్యవహారంలో తాను వెనుకంజ వేసేది లేదన్న బలమైన సంకేతాలు పంపించారు. అయితే రేపు రేవంత్ ఏంచేయనున్నారన్నదానిపై ఇంకా స్పష్టత రాలేదు.


More Telugu News