Corona Virus: దేశంలో ఒక్కరోజులో 9,971 మందికి కొత్తగా కరోనా నిర్ధారణ

  • కరోనా కేసుల సంఖ్య మొత్తం 2,46,628
  • మృతుల సంఖ్య 6,929
  • 1,20,406 మందికి ఆసుపత్రుల్లో చికిత్స  
  • కోలుకున్న 1,19,293 మంది
Biggest single day jump in coronavirus cases in India

దేశంలో కరోనా కేసుల సంఖ్య భారీగా పెరిగిపోతోంది. కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. గత 24 గంటల్లో దేశంలో 9,971 మందికి కొత్తగా కరోనా సోకింది. దేశంలో ఒక్కరోజులో నమోదైన అత్యధిక కేసులు ఇవే. అదే సమయంలో 287 మంది మరణించారు.  
     
ఇక దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 2,46,628కి చేరగా, మృతుల సంఖ్య 6,929 కి చేరుకుంది. 1,20,406 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,19,293  మంది కోలుకున్నారు.

More Telugu News