vietnam: కరోనా వేళ స్టేడియంలో ఫుట్‌బాల్‌ మ్యాచ్.. హాజరైన 30 వేల మంది

  • వియత్నాంలో మ్యాచ్‌
  • భౌతిక దూరం పాటించని అభిమానులు
  • వియత్నాంలో కరోనా కేసులు అతి తక్కువ
  • ఇంగ్లండ్‌, స్పెయిన్‌లో కూడా ఫుట్‌బాల్‌ మ్యాచ్‌లకు సన్నాహాలు
foot ball match in vietnam

ప్రపంచం మొత్తం కరోనా భయంతో.. జనసమూహం ఉండే అన్ని కార్యక్రమాలను వాయిదా వేసుకుంటుంటే  వియత్నాం మాత్రం స్టేడియంలో ఫుట్‌బాల్‌ మ్యాచ్‌ నిర్వహించింది. ఈ మ్యాచ్‌కు సుమారు 30,000 మంది ఫుట్‌బాల్‌ అభిమానులు హాజరయ్యారు. వారెవ్వరూ  భౌతిక దూరం నిబంధన పాటించలేదు.

అసలు భౌతిక దూరం నిబంధన పాటించాలన్న సూచనలు కూడా అధికారులు చేయలేదు. కొంతమంది మాత్రమే మాస్క్‌లు ధరించారు. అభిమానులకు థర్మల్‌ స్క్రీనింగ్‌ చేసి స్టేడియంలోకి అనుమతించారు.  కరోనా వల్ల చాలా రోజులపాటు ఫుట్‌బాల్‌ మ్యాచ్‌ చూడలేదని, దీంతో చాలా విసుగు వేసిందని ఓ అభిమాని మీడియాకు చెప్పాడు. కరోనా అంటూ మ్యాచ్‌లు జరగకుండా అడ్డుకోవద్దని వేడుకున్నాడు.

కాగా, వియత్నాంలో కరోనా కేసులు అతి తక్కువగా నమోదయ్యాయి. 328 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా ఒక్కరు కూడా మృతి చెందలేదు. కాగా, ఇంగ్లండ్‌, స్పెయిన్‌లో కూడా ఫుట్‌బాల్‌ మ్యాచ్‌లు నిర్వహించేందుకు ఆయా దేశాల అధికారులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

More Telugu News