దేశంలో 9,887 మందికి కొత్తగా కరోనా

India reports 9887 new COVID19 cases
  • కరోనా కేసుల సంఖ్య మొత్తం 2,36,657
  • మృతుల సంఖ్య 6,642
  • 1,15,942 మందికి ఆసుపత్రుల్లో చికిత్స
  • కోలుకున్న 1,14,073 మంది
దేశంలో కరోనా కేసుల తాజా గణాంకాలను ఈ రోజు కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. ఈ గణాంకాల ప్రకారం.. గత 24 గంటల్లో దేశంలో 9,887 మందికి కొత్తగా కరోనా సోకింది. దేశంలో ఒక్కరోజులో నమోదైన అత్యధిక కేసులు ఇవే. అదే సమయంలో 294 మంది మరణించారు.  
     
ఇక దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 2,36,657కి చేరగా, మృతుల సంఖ్య 6,642 కి చేరుకుంది. 1,15,942 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,14,073 మంది కోలుకున్నారు.
Go Back to Shorts
COVID-19
Corona Virus
India

More Telugu News