Road Accident: యూపీలో రక్తమోడిన రహదారి... ఇద్దరు చిన్నారుల సహా 9 మంది దుర్మరణం

  • స్కార్పియోలో రాజస్థాన్ నుంచి బీహార్ వెళుతున్న కుటుంబం
  • ట్రక్కును ఢీకొన్న స్కార్పియో వాహనం
  • ఘటన స్థలం నుంచి పారిపోయిన ట్రక్కు డ్రైవర్
Nine dies of accident in Uttarpradesh

ఓ స్కార్పియో వాహనంలో రాజస్థాన్ నుంచి బీహార్ పయనమైన ఓ కుటుంబాన్ని రోడ్డు ప్రమాదం చిదిమేసింది. బీహార్ లోని భోజ్ పూర్ వెళుతుండగా, యూపీలోని ప్రతాప్ గఢ్ జిల్లా వజీద్ పూర్ వద్ద వీరు ప్రయాణిస్తున్న వాహనం ఓ ట్రక్కును ఢీకొట్టింది. తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనలో ఇద్దరు చిన్నారుల సహా 9 మంది అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. మరో వ్యక్తి తీవ్ర గాయాలతో ఆసుపత్రిపాలయ్యాడు.

ఈ ఘటన జరిగిన వెంటనే ట్రక్కు డ్రైవర్ అక్కడ్నించి పారిపోయాడు. కాగా, మృతుల్లో ముగ్గురు మహిళలు కూడా ఉన్నారు. ఈ యాక్సిడెంట్ సమాచారం తెలుసుకున్న యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ఆరంభించారు.

More Telugu News