Hyderabad: అకస్మాత్తుగా కుంగిన మియాపూర్-ప్రశాంత్‌నగర్ రోడ్డు.. 14 అడుగుల లోతులో భారీ గొయ్యి!

  • వాహనదారుల అప్రమత్తతతో తప్పిన ప్రమాదం
  • రాకపోకలు నిషేధించిన అధికారులు
  • కుంగడానికి సిద్ధంగా మరో రోడ్డు
Miyapur prashanth nagar road suddenly pits down

మియాపూర్-ప్రశాంత్‌నగర్ ప్రధాన రోడ్డు మధ్యలో అకస్మాత్తుగా భారీ గుంత ఏర్పడింది. 10 అడుగుల వెడల్పు, 14 అడుగుల లోతులో ఏర్పడిన ఈ గుంత వాహనదారులను భయభ్రాంతులకు గురిచేసింది. వారి అప్రమత్తతతో పెను ప్రమాదం తప్పింది.

సమాచారం అందుకున్న వెంటనే అక్కడికి చేరుకున్న అధికారులు ఆ రోడ్డును బ్లాక్ చేసి రాకపోకలు నిషేధించారు. రోడ్డు ఒక్కసారిగా కుంగడానికి గల కారణాలను తెలుసుకుంటున్నారు. గతంలో ఇక్కడ భారీ పైపులైను నిర్మాణం జరిగిందని, ఆ ప్రభావంతోనే ఇప్పుడు రోడ్డు కుంగి గుంత ఏర్పడిందని అంటున్నారు.

కాగా, ఈ గుంతకు సమీపంలోనే కుంగడానికి సిద్ధంగా ఉన్న మరో రోడ్డును గుర్తించిన అధికారులు అక్కడ కూడా హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. గుంత ఏర్పడిన ప్రాంతంలో మరమ్మతులు చేపట్టారు.

More Telugu News