Corona Virus: దేశంలో ఒక్కరోజులో 9,304 మందికి కరోనా నిర్ధారణ

Biggest   jump in cases in India
  • కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 2,16,919 
  • మృతుల సంఖ్య 6,075 కి చేరిక 
  • 1,06,737 మందికి ఆసుపత్రుల్లో చికిత్స
  • కోలుకున్న 1,04,107 మంది
దేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య రోజురోజుకీ భారీగా పెరిగిపోతోంది. ఈ రోజు కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. గత 24 గంటల్లో దేశంలో 9,304 మందికి కొత్తగా కరోనా సోకింది. దేశంలో ఒక్కరోజులో నమోదైన అత్యధిక కేసులు ఇవే. అదే సమయంలో 260 మంది మరణించారు.  
     
ఇక దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 2,16,919  కి చేరగా, మృతుల సంఖ్య 6,075 కి చేరుకుంది. 1,06,737   మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,04,107 మంది కోలుకున్నారు.
Corona Virus
COVID-19
India

More Telugu News