Corona Virus: దేశంలో 24 గంటల్లో 8,909 మందికి కరోనా

  • దేశంలో ఒక్కరోజులో నమోదైన అత్యధిక కేసులు ఇవే 
  • కరోనా కేసుల సంఖ్య మొత్తం 207,615
  • మృతుల సంఖ్య 5,815 కి చేరుకుంది
  • 1,01,497 మందికి ఆసుపత్రుల్లో చికిత్స  
coronavirus cases in india

దేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య భారీగా పెరిగిపోతోంది. ఈ రోజు కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. గత 24 గంటల్లో దేశంలో 8,909 మందికి కొత్తగా కరోనా సోకింది. దేశంలో ఒక్కరోజులో నమోదైన అత్యధిక కేసులు ఇవే. అదే సమయంలో 217 మంది మరణించారు.  
     
ఇక దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 207,615 కి చేరగా, మృతుల సంఖ్య 5,815 కి చేరుకుంది. 1,01,497  మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 100,303  మంది కోలుకున్నారు.

More Telugu News