MS Dhoni: బైక్ పై తండ్రితో పాటు జీవా... 'రయ్' మంటూ చక్కర్లు కొట్టిన ధోనీ!

  • క్రికెట్ కు విరామాన్ని ఇచ్చిన ధోనీ
  • కుమార్తెతో కలిసి రైడ్ చేస్తుంటే వీడియో తీసిన సాక్షి
  • సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్
Dhoni bike Rides with Jiva

క్రికెట్ కు ప్రస్తుతం విరామాన్ని ఇచ్చిన మహేంద్ర సింగ్ ధోనీ, లాక్ డౌన్ సమయంలో పుత్రికోత్సాహంలో మునిగి తేలుతున్నాడు. ఇంట్లో తానేం చేస్తున్నానన్న విషయాన్ని ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటున్నాడు.

ఈ క్రమంలో తాజాగా, తన కుమార్తెను ముందు కూర్చోబెట్టుకుని బైక్ ను నడుపుతున్న వీడియోను తీసుకోగా, చెన్నై సూపర్ కింగ్స్ టీమ్, దాన్ని పోస్ట్ చేసింది. ఈ వీడియోను ధోనీ భార్య సాక్షి తీసింది. ధోనీకి బైక్ రైడింగ్ చాలా ఇష్టమన్న సంగతి అందరికీ తెలిసిందే. ధోనీ బైక్ పై వస్తుంటే, అతని కుమార్తె జీవా దాన్ని ఎక్కుతాననడం, ధోనీ ఎక్కించుకుని రయ్ మంటూ చక్కర్లు కొట్టడం ఈ వీడియోలో కనిపిస్తోంది.
     

More Telugu News