Corona Virus: ఏపీలో మరో 82 మందికి కరోనా

  • గత 24 గంటల్లో 12,613 శాంపిళ్ల పరీక్ష
  • 24 గంటల్లో కోలుకున్న 40 మంది
  • మొత్తం కరోనా కేసులు 3,200
  • ఆసుపత్రుల్లో కరోనాకు 927 మందికి చికిత్స  
coronavirus cases in ap

ఆంధ్రప్రదేశ్‌లో గత 24 గంటల్లో 12,613 శాంపిళ్లను పరీక్షించగా మరో 82 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయిందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. 24 గంటల్లో 40 మంది కరోనా నుంచి కోలుకున్నారు.

రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసులు 3,200 అని పేర్కొంది. ప్రస్తుతం ఆసుపత్రుల్లో కరోనాకు 927 మంది చికిత్స పొందుతుండగా, ఇప్పటివరకు 2,209 మంది డిశ్చార్జ్ అయ్యారు. మృతుల సంఖ్య మొత్తం 64కి చేరింది.

More Telugu News