Corona Virus: 24 గంటల్లో రికార్డు స్థాయిలో 8,392 కరోనా కేసులు.. ఆసియాలో అగ్రస్థానంలో భారత్

  • గత 24 గంటల్లో 230 మంది మృతి
  • మొత్తం కేసులు 1,90,535
  • మృతుల సంఖ్య 5,394
  • 93,322 మందికి ఆసుపత్రుల్లో చికిత్స
CoronavirusIndia Cases

భారత్‌లో కరోనా వైరస్ కేసుల సంఖ్య భారీగా పెరిగిపోతోంది. కరోనా కేసుల్లో ఆసియాలో భారత్ అగ్రస్థానంలో చేరింది. ఈ రోజు కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. గత 24 గంటల్లో దేశంలో రికార్డు స్థాయిలో 8,392 మందికి కొత్తగా కరోనా సోకగా, 230 మంది మరణించారు.  
     
ఇక దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 1,90,535కి చేరగా, మృతుల సంఖ్య 5,394కి చేరుకుంది. 93,322 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 91,819 మంది కోలుకున్నారు.

More Telugu News