Corona Virus: బిగ్గెస్ట్‌ జంప్‌.. భారత్‌లో ఒక్కరోజులో 8,380 మందికి కరోనా నిర్ధారణ

Coronavirus India 8380 coronavirus cases in India
  • 24 గంటల్లో 193 మంది మృతి  
  • కరోనా కేసుల సంఖ్య  మొత్తం 1,82,143
  • మృతుల సంఖ్య 5,164
  • 89,995 మందికి ఆసుపత్రుల్లో చికిత్స  
భారత్‌లో కరోనా వైరస్ కేసుల సంఖ్య భారీగా పెరిగిపోతోంది. ఈ రోజు కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. గత 24 గంటల్లో దేశంలో ఏకంగా 8,380 మందికి కొత్తగా కరోనా సోకగా, 193 మంది మరణించారు.  
     
ఇక దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 1,82,143కి చేరగా, మృతుల సంఖ్య 5,164కి చేరుకుంది. 89,995 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 86,984 మంది కోలుకున్నారు.

Corona Virus
COVID-19
India

More Telugu News