Corona Virus: దేశంలో ఒక్క రోజులో 7,964 మందికి కరోనా

  • 24 గంటల్లో 265 మంది మృతి  
  • మొత్తం కేసులు 1,73,763
  • మృతుల సంఖ్య 4,971
  • 86,422 మందికి ఆసుపత్రుల్లో చికిత్స  
coronavirus cases in india

భారత్‌లో కరోనా వైరస్ కేసుల సంఖ్య భారీగా పెరిగిపోతోంది. ఈ రోజు కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. గత 24 గంటల్లో దేశంలో 7,964 మందికి కొత్తగా కరోనా సోకగా, 265  మంది మరణించారు.  
     
ఇక దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 1,73,763కి చేరగా, మృతుల సంఖ్య 4,971కి చేరుకుంది. 86,422 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 82,370 మంది కోలుకున్నారు.

More Telugu News