కూల్ డ్రింకులో నిద్రమాత్రలు కలిపి... బావిలో మృతదేహాల ఘటనలో వీడిన మిస్టరీ!
- వరంగల్ శివారు ప్రాంతంలో ఒకే బావిలో 9 మృతదేహాలు
- పోలీసులకు సవాల్ గా మారిన కేసు
- నేరం అంగీకరించిన సంజయ్ కుమార్ యాదవ్!
అనుమానంతో అదుపులోకి తీసుకున్న సంజయ్ కుమార్ యాదవ్ నేరాన్ని అంగీకరించినట్టు సమాచారం. కూల్ డ్రింకులో నిద్రమాత్రలు కలిపి, వారు స్పృహలో లేరని నిర్ధారించుకున్న తర్వాత బావిలో పడేసినట్టు విచారణలో తేలింది. నిందితుడు సంజయ్ కుమార్ యాదవ్ ను రేపు మీడియా ముందుకు తీసుకువస్తారని తెలుస్తోంది. సంజయ్ కుమార్ యాదవ్ బీహార్ కు చెందినవాడిగా గుర్తించారు.