ఓయూలో కాంగ్రెస్ నేతల పర్యటన.. ఉద్రిక్తత
- భూములను పరిశీలించడానికి వెళ్లిన కాంగ్రెస్ నేతలు
- కబ్జా అయిన భూములను చూస్తామన్న వీహెచ్
- కాంగ్రెస్ నేతలను అడ్డుకున్న పోలీసులు
- వారితో వీహెచ్ వాగ్వివాదం
భూములను పరిశీలించడానికి వెళ్లినవారిలో వీహెచ్తో పాటు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్రెడ్డి, భట్టి విక్రమార్క, వంశీచంద్రెడ్డి కూడా ఉన్నారు. ఓయూ భూముల్లో కొందరు నిర్మాణాలు చేపడుతుండడం పట్ల వివాదం చెలరేగుతోంది. ఈ నేపథ్యంలోనే ఆ భూములను సందర్శించడానికి కాంగ్రెస్ నేతలు వెళ్లారు.
ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ మాట్లాడుతూ... ఓయూ భూములపై తాము త్వరలోనే గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ను కలుస్తామని తెలిపారు. ఓయూ భూముల ఆక్రమణను అడ్డుకుంటామని చెప్పారు.