జూన్ 1 నుంచి దేశ వ్యాప్తంగా ప్యాసింజర్ రైళ్ల పరుగులు!

Piyush goel Tweet on Trains Moving
  • జూన్ 1 నుంచి 200 రైళ్లు తిరుగుతాయి
  • త్వరలోనే రిజర్వేషన్లు ప్రారంభం
  • ట్విట్టర్ లో వెల్లడించిన రైల్వే మంత్రి పీయుష్ గోయల్
జూన్ ఒకటి నుంచి రైళ్లను నడపడానికి రైల్వే శాఖ ఏర్పాట్లు చేసుకుంటోంది. ఈ మేరకు రైల్వే మంత్రి పీయుష్ గోయల్ ఓ ట్వీట్ చేశారు. జూన్ 1 నుంచి దేశమంతటా నిత్యమూ 200 నాన్ ఏసీ రైళ్లను టైమ్ టేబుల్ ప్రకారం నడిపించాలని నిర్ణయించామని ఆయన పేర్కొన్నారు. ఈ రైళ్లకు త్వరలోనే ఆన్ లైన్ రిజర్వేషన్ అందుబాటులోకి వస్తుందని కూడా అన్నారు.

పీయుష్ గోయల్ ట్వీట్ ను చూసిన వారంతా ఈ నెల 31 తరువాత లాక్ డౌన్ ఇక దాదాపుగా తొలగిపోయినట్టేనని అంటున్నారు. కాగా, లాక్ డౌన్ సమయంలో కొన్ని ప్రత్యేక రైళ్లను, వలస కూలీలను తరలించే రైళ్లను నడిపిన సంగతి తెలిసిందే. 
Go Back to Shorts
Lockdown
Piyush Goyal
Trains
May 31

More Telugu News