Puri Jagannadh: అరుదైన వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేసిన పూరీ జగన్నాథ్

  • 1954 నాటి వీడియోను పోస్ట్ చేసిన పూరీ
  • బాలీవుడ్ తారలకు సంబంధించినది
  • జార్జియాకు వెళ్లినప్పుడు తీసిన వీడియో
Puri Jagannadh posts Bollywood old video

రామ్, పూరీ జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన 'ఇస్మార్ట్ శంకర్' చిత్రం ఘన విజయం సాధించింది. ఆ తర్వాత విజయ్ దేవరకొండ హీరోగా పూరీ కొత్త ప్రాజెక్టును ప్రారంభించారు. అయితే లాక్ డౌన్ కారణంగా ఈ సినిమా షూటింగ్ ఆగింది. అయితే, ఈ గ్యాప్ లో తన సినిమాకు సంబంధించిన పనులతో పాటు, సోషల్ మీడియాలో కూడా జగన్ బిజీగా గడుపుతున్నారు. తాజాగా ఓ ఆసక్తికరమైన వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. 1954 నాటి వీడియో అది. బాలీవుడ్ తారలు జార్జియాకు వెళ్లిన సమయంలో తీసినది. ఈ వీడియోలో రాజ్ కపూర్, దేవానంద్, నర్గీస్, బిమల్ రాయ్, బల్రాజ్ సహానీ తదితరులు ఉన్నారు.

More Telugu News