World Bank: భారత్ కు వంద కోట్ల డాలర్ల ఆర్థిక సాయం ప్రకటించిన ప్రపంచబ్యాంకు

  • సామాజిక భద్రత కోసం భారీ ప్యాకేజి
  • మూడు రంగాల్లో భారత్ తో ప్రపంచబ్యాంకు భాగస్వామ్యం
  • వెల్లడించిన ప్రపంచబ్యాంకు భారత్ విభాగం డైరెక్టర్
World Bank announces one billion dollars for India

కరోనా కష్టకాలంలో ప్రపంచబ్యాంకు భారత్ కు శుభవార్త చెప్పింది. సామాజిక భద్రత ప్యాకేజి కింద భారత్ కు 1 బిలియన్ డాలర్లు (రూ.7,549 కోట్లు) ఆర్థిక సాయం చేస్తున్నట్టు ప్రకటించింది. భారత ప్రభుత్వం చేపడుతున్న వివిధ పథకాల కోసం ఈ నిధులు ఇస్తున్నట్టు ప్రపంచబ్యాంకు వెల్లడించింది. ప్రపంచబ్యాంకు భారత్ తో మూడు రంగాల్లో భాగస్వామిగా ఉండనుంది. ఆరోగ్యం, సామాజిక భద్రత, సూక్ష్మ-చిన్న-మధ్య తరగతి పరిశ్రమల రంగంలో భారత్ కు దన్నుగా నిలవాలని బ్యాంకు భావిస్తోంది. ఈ మేరకు ప్రపంచబ్యాంకు కంట్రీ డైరెక్టర్ (భారత్) జునైద్ అహ్మద్ తెలిపారు.

More Telugu News