విజయ్ మాల్యాకు చుక్కెదురు... ఇక భారత్ కు అప్పగింతే తరువాయి!
- గత నెలలో మాల్యా పిటిషన్ కొట్టివేత
- సుప్రీంను ఆశ్రయించేందుకు అనుమతించాలంటూ దరఖాస్తు
- ఆ దరఖాస్తును కూడా కొట్టివేసిన యూకే హైకోర్టు
దాంతో, తాను సుప్రీంకోర్టులో పిటిషన్ వేసేందుకు అనుమతి ఇవ్వాలంటూ న్యాయస్థానానికి దరఖాస్తు చేసుకోగా, తాజాగా ఆ దరఖాస్తును కూడా న్యాయస్థానం తిరస్కరించింది. దాంతో విజయ్ మాల్యాకు న్యాయపరమైన అవకాశాలన్నీ ముగిసినట్టయింది. ఈ నేపథ్యంలో, కోర్టు ఇచ్చిన తీర్పు ప్రతిపై బ్రిటన్ హోంశాఖ కార్యదర్శి ప్రీతి పటేల్ అధికారిక ముద్రవేయడమే తరువాయిగా కనిపిస్తోంది. ఈ మొత్తం ప్రక్రియ 28 రోజుల్లో పూర్తికానుండగా మాల్యా భారత్ కు రాకతప్పదని తెలుస్తోంది.