ప్యాకేజీపై ఈ సాయంకాలం మరిన్ని కీలక వివరాలు వెల్లడించనున్న నిర్మలా సీతారామన్
- రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీకి సంబంధించిన వివరాలు తెలుపుతున్న నిర్మల
- నిన్న తొలి మీడియా సమావేశం
- ఈ రోజు మరో రంగంపై ఆర్థిక ప్యాకేజీ వివరాలు
- వ్యవసాయ రంగంపై వివరాలు తెలిపే అవకాశం
ప్యాకేజీ లబ్ధిదారుల వివరాలను కేంద్ర ప్రభుత్వం విడతల వారీగా ప్రకటిస్తోంది. ఈ క్రమంలో ఈ రోజు సాయంకాలం ఆమె వ్యవసాయ రంగానికి సంబంధించిన ప్యాకేజీ వివరాలను ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. పదిహేను రకాల ఉద్దీపన పథకాలను ప్రకటించబోతున్నామని నిన్న ఆమె తెలిపిన విషయం తెలిసిందే. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ప్రభుత్వ గ్యారంటీతో మూడు లక్షల కోట్ల రూపాయల అప్పులు ఇస్తామని నిన్న ఆమె తెలిపారు.