17 తరువాత రెడ్ జోన్లలో మాత్రమే లాక్ డౌన్... మిగతా చోట్ల సడలింపులు: కేంద్ర వర్గాల వెల్లడి
- నిన్న దాదాపు 6 గంటలు సాగిన వీడియో కాన్ఫరెన్స్
- రాత్రిపూట కర్ఫ్యూ, ప్రజా రవాణా ఆంక్షలు రెడ్ జోన్లలోనే
- మరిన్ని నిబంధనలు ఎత్తివేయనున్న కేంద్రం
"ఇప్పటివరకూ చేసిందాన్నే కొనసాగించాలని భావిస్తున్నాను. తొలి దశ లాక్ డౌన్ నిబంధనలను రెండో దశలో సడలించాం. రెండో దశలోని కొన్ని నిబంధనలను మూడో దశలో సడలించాం. అదే విధంగా నాలుగో దశ లాక్ డౌన్ లోనూ పాటించాలి" అని ఈ వీడియో కాన్ఫరెన్స్ తరువాత విడుదల చేసిన మీడియా ప్రకటనలో నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. ఇక రెడ్ జోన్ నిబంధనలను జిల్లాల స్థాయిలో కాకుండా, కంటైన్ మెంట్ జోన్ల స్థాయిలోనే ఉండేలా చూడాలని కూడా పలు రాష్ట్రాలు మోదీకి విజ్ఞప్తి చేశాయి.