చేప ప్రసాదం పంపిణీ లేదు: బత్తిని సోదరుల కీలక ప్రకటన

No Fish Medicine this Year
  • కరోనా కారణంగా మందు తయారు చేయడం లేదు
  • ఈ సంవత్సరం ఎవరూ హైదరాబాద్ రావద్దు
  • మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో బత్తిని
లాక్ డౌన్, కరోనా వైరస్ నేపథ్యంలో ఈ సంవత్సరం చేప ప్రసాదం పంపిణీ చేయడం లేదని బత్తిని సోదరులు ప్రకటించారు. ప్రతియేటా మృగశిర కార్తె ప్రవేశించగానే, వేలాదిగా ఉబ్బస రోగులు చేప ప్రసాదం కోసం హైదరాబాద్ వస్తుంటారన్న సంగతి తెలిసిందే. అయితే, కరోనా మహమ్మారి కారణంగా ఈ ఏడాది చేప ప్రసాదం పంపిణీ చేయడం లేదని మీడియాకు ఓ ప్రకటన ద్వారా బత్తిని హరినాథ్ గౌడ్ తెలియజేశారు.
 
 చేప ప్రసాదం ఉందని చెప్పినా, ఎవరైనా ఆన్ లైన్ లో పంపుతామన్నా నమ్మవద్దని, అసలు తాము ఈ ఏడాది ప్రసాదాన్ని తయారు చేయడం లేదని స్పష్టం చేశారు. ఎవరూ చేప ప్రసాదం కోసం హైదరాబాద్ రావొద్దని వారు కోరారు. ఈ నెల 29తో తెలంగాణలో లాక్ డౌన్ ముగిసినా, తాము ప్రసాదాన్ని పంపిణీ చేయబోమని, ఎవరైనా తమ పేరిట పంపిణీ చేస్తే, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Go Back to Shorts
Fish Medicine
Battini Harinath Goud

More Telugu News