Karnataka: ఇంట్లోకి చొరబడి బాలుడిని లాక్కెళ్లి చంపి తిన్న చిరుత

  • కర్ణాటకలోని రామనగర జిల్లాలో ఘటన
  • వేసవి కావడంతో తలుపులు తెరిచి నిద్రించిన కుటుంబం
  • ఇంటికి 60 మీటర్ల దూరంలోని ముళ్ల పొదలో బాలుడి మృతదేహం
Leopard killed 3 year boy in Karnataka

ఇంట్లోకి చొరబడిన ఓ చిరుత మూడేళ్ల బాలుడిని లాక్కెళ్లి చంపి తిన్న ఘటన శుక్రవారం రాత్రి కర్ణాటకలోని రామనగర జిల్లాలో జరిగింది. జిల్లాలోని మాగడి తాలూకా కదరయ్యనపాళ్యానికి చెందిన కుటుంబం వేసవి కావడంతో ఇంటి తలుపులు తెరిచి నిద్రపోయింది. వీరు మంచి నిద్రలో ఉండగా అర్ధరాత్రి వేళ ఇంట్లోకి చొరబడిన చిరుత వారి మూడేళ్ల కుమారుడు హేమంత్‌ను నోట కరుచుకుని పట్టుకెళ్లింది.

ఉదయం లేచి చూసే సరికి కుమారుడు కనిపించకపోవడంతో దిగ్భ్రాంతికి గురైన తల్లిదండ్రులు మంగళగౌరమ్మ, చంద్రప్ప దంపతులు గ్రామస్థులతో కలిసి సమీపంలో గాలించారు. ఇంటికి 60 మీటర్ల దూరంలోని ముళ్ల పొదల్లో బాలుడి మృతదేహం కనిపించినట్టు చెప్పారు.

More Telugu News